ధన్యుల జేశాడు -- కోరాడ నరసింహా రావు !
 పురాణపురుషుడుప్రహ్లాదుండు 
 పరమభాగవతోత్తముండు.. !
నిశ్చలభక్తికి.....
           ,నిర్వచనమే ఈతడు !
ఇతనికి  సాటి ఇతనే...  
        వేరొకరు లేని మేటి !!
 తండ్రియే కాదు... మరణమే 
 వచ్చినా...వెనుకడుగేయక ... 
సత్యమునకు వెఱపే  లేదని... 
        చాటి చెప్పినాడు !
శ్రీ హరియే....ద్విరూపావ తారు నిగా, నారసింహుడైభువినుండి దివికి,దిగి... వచ్చినాడు !!
కలడు, కలండను వాడు... 
 కలడో, లేడో యను సంశ యా త్ములకు... సమాధానముగ
 ఇందు గల నందు లేనను సందే హమేల మీకని...ఎందెందు వెద
కిజూచిన అందందే కానగలనని
భక్తుని వాక్యము సత్యమని... 
 నిరూపించుచూ... శిష్టులకు ఒకచేత కమలమును , దుష్టు లకు వేరొకచేత,సుదర్శనమును బట్టి... స్తంభమునుండివెడలి వచ్చినాడు,దర్శనమునిచ్చినాడు....  నమ్మిన భక్తుల ధన్యుల జేశాడు.... !!
    ********

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం