పల్లవి :-
ఎగిరే పక్షికి, ఈదే చేపకు
ఎవరు నేర్పినారావిద్యలు...,
పుట్టుకతోనే సహజముగానే
వచ్చెనహో ఆ సామర్ధ్యము !
"ఎగిరే పక్షికి...... "
చరణం :-
రోకటి బండిని చూసి రైలును
పక్షిని చూసి విమానమును....
చేపను చూసి జలాంతర్గామిని
కనిపెట్టిన నీకు,ఈమిడిసిపాటు
ఎందులకు.... !?
కీటకములను,పశుపక్ష్యాదుల నూచూసి నేర్చిన ఓ మనిషీ.. !
అణగద్రొక్కటం ఒకటే తెలిసీ....
చలాయించేవు అజమాయిషీ !!
"ఎగిరే పక్షికి........ "
చరణం :-
జుగుప్సాకర గొంగళి పురుగే
సీతాకోక చిలుకగ మారగ....
మేధావియైన ఓ మనిషీ....
మంచిగ నీవు మారలేవా...
మంచిగ నీవు మారలేవా....
నీవు మనిషి గా... మారలేవా
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి