లలితగీతం:- కోరాడ నరసింహారావు !
పల్లవి :-
      ఎగిరే పక్షికి, ఈదే చేపకు 
ఎవరు నేర్పినారావిద్యలు..., 
  పుట్టుకతోనే  సహజముగానే 
 వచ్చెనహో  ఆ  సామర్ధ్యము !
         "ఎగిరే పక్షికి...... "
చరణం :-
    రోకటి బండిని చూసి రైలును 
పక్షిని చూసి విమానమును.... 
  చేపను చూసి జలాంతర్గామిని 
కనిపెట్టిన నీకు,ఈమిడిసిపాటు 
  ఎందులకు.... !?
  కీటకములను,పశుపక్ష్యాదుల నూచూసి నేర్చిన ఓ మనిషీ.. !
అణగద్రొక్కటం ఒకటే తెలిసీ.... 
చలాయించేవు అజమాయిషీ !!
       "ఎగిరే పక్షికి........ "
చరణం :-
     జుగుప్సాకర గొంగళి పురుగే 
సీతాకోక చిలుకగ మారగ.... 
  మేధావియైన ఓ మనిషీ.... 
  మంచిగ నీవు మారలేవా... 
 మంచిగ నీవు మారలేవా.... 
  నీవు  మనిషి గా... మారలేవా 
          ******-

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం