శంకరాచార్య;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇవాళ మనం అందరం  శంకరాచార్యుల వారిని జగద్గురువుగా కొలుస్తున్నాం  దానికి కారణం  అతిపిన్న వయసులోనే అరిషడ్ వర్గాన్ని  జయించి లౌకిక సుఖాలకు దూరంగా ఉండి  ఈ సమాజానికి ప్రపంచానికి నేను ఏం చేయగలను అని ఆలోచించి  దానిని ప్రచారం చేయడం కోసం  జీవించాడు తప్ప  తన వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదు  వారి మాటల్లో మన చెప్పుకునే  అరిషడ్వర్కాలలో మొదటగా చెప్పుకోదగినది కామం. కామము అంటే చెడు ఏమీ లేదు  కామము అంటే కోరిక  ఎదుట ఏ వస్తువులు చూసినా ఆ వస్తువు తన సొంతం చేసుకోవాలన్న అభిప్రాయంతో  దానిపై  మమకారాన్ని పెంచుకోవడం  దానిని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నించడం  అది సాధ్యం కాకపోతే జీవితంలో  ఇబ్బంది పడడం  ఒకదాని తరువాత మరొకటి వరుసగా వస్తాయి.
తన ఆరోగ్యాన్ని గురించి  తన బాగు గురించి పెద్దలు ఎన్నో విషయాలు మనకు చెబుతూ ఉంటాడు  వాటిని తూ.చా. తప్పకుండా చేసినట్లయితే  ఎలాంటి రుగ్మతలకు వెళ్ళకుండా  ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది  కానీ మనసు అలా చేయనిస్తున్నదా  దేని పైన విపరీతమైన మక్కువ కలుగుతుందో  దానికోసం ప్రయత్నం చేయడంతోనే జీవితం కొనసాగుతుంది  ఎప్పుడు కామం ప్రారంభమైందో మిగిలిన 5  క్రోధ లోభ మోహ  మద మాత్సర్యములు ఒకదాని వెంట ఒకటి  మనలను ఆశ్రయించుకుంటాయి  దీనికి కారణం శంకరాచార్యుల వారు ఏం చెబుతున్నారంటే  మనం దేనిని చూసామో దానిమీద విపరీతమైన మక్కువ పెంచుకోవడం  గురించి విచారణ చేయాలి. వస్తు విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో  ఆ వస్తువు వల్ల మనకు జరిగే  ప్రయోజనం మంచిదా చెడ్డదా  మంచిదైతే ఈ కారణాలవల్ల  దానిని స్వీకరించవచ్చు  లేదా చెడు అన్న అభిప్రాయం  కలిగినట్లయితే  ఆ క్షణమే ఆ ఆలోచనలు మానివేయడం  వలన మనసు దానిపైకి వెళ్లదు  సామాన్యంగా ఎవరికైనా  మందు మగువ  సంపదలపై  ఆశ ఉంటుంది  ఇది సహజమైన కోరిక ఈ మూడు మనకు లభించినట్లయితే  ఐశ్వర్యం రావడం వల్ల  విపరీతమైన అహం పెరుగుతుంది  మందు వల్ల మనసు ఆలోచన నాశనం అయిపోతుంది  మగువ స్త్రీ వ్యామోహం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ క్షణానే అతని జీవితంపతనం అవడం ప్రారంభం అవుతుంది  ఇవి మంచి చేయకపోగా  విపరీతమైన చెడును చేస్తాయి కనుక వాటిని వదిలివేయడం శ్రేయస్కరం  అని మనసును అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నారు శంకరాచార్య  చెప్పడమే కాదు ఆచరణలో కూడా చూపినవాడు  కనుకనే జగద్గురువుగా ప్రసిద్ధి  చెందారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం