ధర్మో రక్షతి రక్షిత,;-ఎం.స్ఫూర్తి,-9వ.తరగతి,-తెలంగాణ ఆదర్శ పాఠశాల,-బచ్చన్నపేట మండలం,-జనగామ జిల్లా

 ధర్మానికి వేదాలు ప్రమాణాలు.ధర్మాధర్మ విచక్షణ వచ్చినప్పుడు సత్పురుషుల ఆలోచించి తగిన నిర్ణయం చేసి ధర్మపక్షపాతులై ధర్మాన్ని ఆచరించిన వారు ఇహలోకాల్లో కీర్తిని,సుఖాన్ని పొందుతారు.మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టం కలిగించకుండా నెరవేర్చుకోవడమే ధర్మం యొక్క ముఖ్య లక్షణం అని చెప్పవచ్చును.భూమి మీద సకల మానవులలోనూ కొందరు ఉత్తములుగా ఉండి తోటి మానవులలో పూజింపబడితే,దైవ సమానులుగా భావించబడడానికి వారు ఆచరిస్తున్న ధర్మగుణమే ప్రధాన కారణం.
శాంతి,దయ,
అహింస,సత్యము,ఆస్తేయము,ఉపకారము,సానుభూతి,సౌచము మొదలగు సుగుణములు అన్ని ధర్మమునకు అవయవాలై ఉన్నాయి.చంపబడిన ధర్మం ఆ ధర్మాని ఆచరిస్తున్న వారిని చంపుతుంది. రక్షింపబడిన ధర్మం ఆ ధర్మాన్ని రక్షించిన వారిని రక్షిస్తుంది.కనుక ధర్మం చేత మనమిప్పుడు చంప పడకుండా ఉండేందుకు మనము ధర్మాన్ని సదా రక్షించాలి.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం