సుప్రభాత కవిత ; - బృంద
నింగీ నేలా కలిసే చోట
నీలం ఎరుపుగ మారే పూట
తూరుపు వాకిట గగనపు బాట
లోకపు చీకటి తరిమే వెలుగు పువ్వట!

పొన్నపూల రంగుతో
పొడిచేనంట
పొద్దెక్కు వేళ పగడపు
ఎరుపుగా మారేనంట!

నింగిలో మారుతున్న
రంగులు చూసి
పువ్వులన్నీ పకపకా
నవ్వులుగా విరిసేనట!

పచ్చని పైటేసి పుడమితల్లి
కిరణాలు తాకినంత
మరకతమణి వోలె
మెరిసి మురిసి పోయేనంట!

రంగు రంగుల సుమశ్రేణి
అవనికి  అపురూప అందాల 
ఆభరణములుగా అలరించి
ఆనంద లహరిలో తేలించెనట!

రమణియ సోయగపు
కమనీయ దృశ్యము 
కన్నులకు విందుగా
మురిపింప మనసు పాడె

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం