పరమేశా!- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
1.  అణువై జగములు నిండి యాద్యుడవై స
ద్గుణముల్ జనుల కొసంగు దోష నివారా!
క్షణమైనను కనిపించి కావుము దేవా!
మణులేమియు వలదంటి! మా పరమేశా!//

2. ధరయందున నిను బోలు దైవము లేకే
పరమాత్మవనుచు నీదు పాదములే నా
శిరమందున ధరియింతు సేమము నొందన్
సిరులన్నియు తృణ మంటి!శ్రీ పర మేశా!//

3. సురపూజిత!పరమాత్మ!శోధన లేలా!
నిరతంబు నిను భజింతు నిష్ఠగ శంభో!
తరియింపగ!దయ జూపు దైవము నీవే!
పరిపాలక!కరుణించవా పరమేశా!/

4. జగమేలెడి హర!నీదు సన్నిధి చెంతన్
నిగమావళి నిరతమ్ము నిల్చును శంభో!
నగజాపతి!నిను నా మనంబున గొల్తున్
వగబాపగదె!సదాశివా!పరమేశా!//

5. సురగంగను సిగయందు సొంపుగ నీవే
మురిపెంబుగ ధరియించి మోదము తోడన్
జిరునవ్వులు చిలికించు శ్రీకర నిన్నే
వరమే యడగను!కావవా!పరమేశా!//

-------------------------


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం