మట్టి వాక్యాలు!!!?;- ప్రతాప్ కౌటిళ్యా
కోట్ల నదులు పారుతున్న అగ్ని మహాసముద్రంలో
సూర్యుళ్ళు కొట్టుకుపోతున్నారు!
సూక్ష్మతీ సూక్ష్మ వెంట్రుకల్లా
రంగుల రంధ్రాలు తెరుచుకుంటున్నవీ సూర్యకిరణాల్లో
నిప్పుల నీళ్లు కళ్ళు తెరుచుకునే లోపే
రెప్పల ద్వారాలు మూతపడుతున్నవీ!!

రేపటి నిప్పుల కుంపటి
పొగ లేకుండానే వేడిని కంటున్నట్లు
వెలుగు వాకిలి ముందు ఎదురుచూస్తుంది.!!

కొంత అలలుగా కొంత తీగలుగా
కొంత కిరణాల కాలువలుగా
వెలుగు పారుతుంది తీరం వెంట!!!
పిసికేసిన అగ్నితో ఎర్ర సముద్రం నల్ల సముద్రం గా మారింది.!!

కోటి జన్మల తర్వాత
జ్వాలలు జ్యోతులుగా మారినట్లు
చీకటి చరిత్ర పుటలు చెప్తున్నాయి!!

నిప్పును దంచి మింగితే
కొలిమిలో దూరిన అగ్ని లావాలా పొంగి
లోహంగా మారుతుంది ఇప్పుడు.!!

అగ్నిశిఖల తెరచాపలు వేడి గాలులకు
ముందుకు సాగుతున్నవి నావల్లా!!

వలలో చిక్కిన చాపల్లా
నిప్పు కనికలు ఎగిరి పడుతున్న వేళ
బాగా కాలిన సూర్యుని
కాలసముద్రంలో ముంచితే
కాకంతా కందిపోయి కరిగిన పొయ్యిలా మారింది.!!!

ఎండమావుల్లా పారుతున్న వేడి
కొండచిలువల్ల దారులన్నింటికీ అడ్డుపడితే
దుప్పట్ల దూళి పొగలు
నిప్పును కప్పి వేస్తున్నవీ!!!

తెల్లారితే తేలిపోయే వెలుగు మేఘాలు
ఎక్కడికో పారిపోకుండా
ఆకాశమంత ఆవిరితో నింపుతున్న
మట్టి పోయ్యి!!!

భూమిని మట్టికుండగా కాల్చిన మంట
ఇప్పుడు మంటను కూడా
కుండలో ఉడికిస్తున్న మట్టి గట్టితనమే
భూమి పుట్టుకకు గుడ్డి గుర్తు!!!!

రాళ్లను సృష్టించిన నిప్పు
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
మట్టితోనే కప్పబడింది.!!!

బంగారం వెండి ఇనుము బయటపడ్డ
భాగ్యమంత మన్ను లోనే కదా!!!

ఆనాటి మంట మాటలే
నేటి మట్టి వాక్యాలు కథ!!!?

ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు
Jayaho Jaladi చెప్పారు…
ఒక వాక్యం కూడా అర్ధం కాలేదు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం