సుప్రభాత కవిత ; -బృంద
చీకటిని వెలివేసి
వెలుగులను కురిపించి
లేత ఎండలలో వెచ్చని వెన్నెల్లా
హాయిగా మైమరపించే

అంబరపు సంబరం 
అంతరంగాలు మురిపించి
స్వప్నాలు సత్యాలుగా
సాక్షాత్కరించే

హృదయసీమల పరచుకున్న
ఉదయరేఖలు ముదముతో
మదిని మురళిగా మలచి
ఊపిరులూది అలరించే

నింగి లోని నీలమంతా
బంగరు రంగైపోగా
కాంచన కిరణాలు తాకి
పుడమి పుత్తడిలా మెరిపించే

కలిసిన శాఖల మధ్యన
మెరిసే దళాల అంచున
ఆగని వేగపు వెలుగుల
విరిసిన మెరుపుల కిరణం

కన్నుల తాకిన తరుణం
మిన్నులు అందిన భావం
మన్నుల దాగిన సోయగం
వెన్నగ మారి కరిగినట్టు

కనకధారల తడిసిన
అవనికి

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం