సౌందర్యలహరి; - కొప్పరపు తాయారు
  🌻 శ్రీ శంకరాచార్య విరచిత 🌻

జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతివిధిః ।
ప్రణామస్సంవేశస్సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితమ్ ॥ 27 ॥

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః ।
కరాలం యత్క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవా  జనని తాటంకమహిమా ॥ 28 ॥

,27), ఓ జగన్మాతా! భగవతీ! నీ పాదముల చెంత   ఆత్మార్పణ భావముతో నేను చేయు సంభాషణ _
ఓ మంత్రజపముగానూ_ నా హస్త విన్యాసమంత
యూ_నీ ముద్రారచనగానూ_నేను ఎక్కడ తిరిగినా
అది నీకు చేసిన ప్రదక్షిణ గానూ_ నా భోజనాదులు_
నీకు యజ్ఞంలో సమర్పించు
ఆహూతులుగానూ,_నేను పరుండుట_నీకు  చేసే
సాష్టాంగ దండ ప్రణామంగానూ,_ఈవిధంగా ప్రతి క్షణము నేను చేసే ప్రతి పనీ, నీకు చేసే సంపూర్ణ
మైనా,సంతోషదాయక మైన పూజగా అగు గాక !
28) తల్లీ ! జగన్మాతా! బ్రహ్మ ఇంద్రుడు,మున్నగు 
దేవతలందరూ, జరా మృత్యువులను జయించే
అమృతమును తాగినవారై ఉండి కూడా ప్రళయ కాలం వచ్చినప్పుడు మరణిస్తున్నారు.
 లోకములను దహించే కాలకూటవిషమనే మహావిషమునుమ్రింగి_నీలకంఠుడిగా మారిన  నీ పతి అయినా శంభుడు మాత్రం ప్రళయకాలము నందు కూడా మరణించక చిరంజీవియై ఉన్నాడు. అందుకు ముఖ్య కారణం నీ చెవుల యందు బాసిల్లుచున్న మంగళకరమైన నీ తాటంకములు(చెవి
కమ్మలు) ప్రభావమే!!!
                     ,🪷***🪷***🪷
తాయారు 🪷

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం