ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 ఏమీ ఇది మీ రాజ్యమా  గోమాతల వంటి మేము  కరుణను చూపితే ఎంతో ప్రేమను  నటిస్తూ మోసం చేసిన  మీ మాయలో పడి ఈ రాజ్యం మీకు దక్కింది  యుగయుగాల నుంచి తల్లి ఒడిలో సేదతీరుతున్న జాతి మాది  అతిథులు అనే వారు ఏ వేళలో వచ్చినా  వాటిని ఎంతో ఆదరంగా  చూసే జాతి  దానిని సాకుగా తీసుకొని మమ్మల్ని ఆశ్రయించి వ్యాపారం కోసం బ్రతకడానికి వచ్చి  మేమంటు దొంగ జపంలు చేస్తూ కొంగల్లాగా అన్నదమ్ముల మధ్య ఆరడి సృష్టించి సాయపడుతమంటూ సందు చూసి మోసం చేసి దేశాలను అపహరించి దోచుకుని పోయే మా దొడ్డ నీతి   మీది  మానవతా సత్య శీలత మా నీతి  మీకు మాకు  ఏ విధంగా సామ్యం సమకూరుతుంది  అనగానే రూథర్ఫర్డ్ అహంకరించి  రవి అస్తమించని రాజ్యమున ఘన చరిత్ర మాది  భారతదేశానికి బానిసత్వం తప్ప వేరే ఏదైనా కలదా  అనగానే ఉగ్రుడైన రాజు  రవి అస్తమించని సామ్రాజ్యమా మీది  ఇలాంటి అతిశయాలతో అబద్ధాలతో  ఎందరిని ఎంత కాలం మోసం చేయగలరు  గొర్రె తోక ఎంత ఉందో అంత ఉంటుంది మీ దీవి  సముద్రంలో దొంగల్లాగా ఓడ సరుకులను దోచుకుంటూ బ్రతికిన బహుదొంట చరిత్ర మీది అతిధి అభ్యాగతులను ఆధారంగా పిలిచి  సిద్ధాన్న మిడిన జాతిరా మాది ఈ మహా ప్రపంచంలో ఒక చిన్న మరుభూమి రా మీ జన్మభూమి సస్యశ్యామలమైన సువిశాల క్షేత్రమై బంగారు పంటలు పండే  భూమి రా మాది  ఆయుధాలపై ఆధారిపడే బ్రతికే జాతి నీతి  మీ జీవితంలో మృగతత్వం తప్ప మరేమీ కనిపించదు  శాంతి అహింసలతో సమతను మమతను నింపి  జ్యోతులను వెలిగించిన నీతి గల జాతి రా    మాది. ఆ ధర్మమే సిద్ధాంతం గా బ్రతికే జాతి 13 సంవత్సరాల మాత్రమే నిలిచి ఉంటుంది  ధర్మ మార్గంలో నడిచే నా జాతి  వేయి ఏండ్లు అయినా అలా నిలిచే ఉంటుంది  మీ రాజ్యం ఇంకా నిలిచి ఉండేది ఐదు సంవత్సరాలు మాత్రమే  ఆ తర్వాత మా రాజ్యం అవతరిస్తోంది  అని పలికిన రాజు మాటలను విని ఆంగ్ల ద్వారా  నాగరికత పంచినాము  మీకు ఉద్యోగాలను  ఇవ్వడం కోసం విద్యలను నేర్పించాము  రైలుబండ్లకు  మార్గాలను మేము వేయలేదా  ఆ మాటలు విన్న రాజు అలవోకగా నవ్వి  మా చెవులలో మీకు పువ్వులు కనిపిస్తున్నాయా  మీరు చేసిన గొప్ప పనులన్నీ కూడా చెబుతూ ఉన్నారు  నేనేమైనా చంటి పిల్లవాడిని అని  అనుకొని చెప్తున్నారా అన్నాడు రాజు.



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం