మనం ఎన్నుకునే
ప్రభుత్వాలు .....
మనం --
తెలుఁగు వాళ్లం
అన్నమాట ---
అనందంగా,
మరచిపోతాయ్ !
అధికార భాష ' తెలుఁగు 'అని
మహాగొప్పలు
చెప్పుకుంటాం ...
దుర్భిణి వేసినా
తెలుగుకనపడని ,
దుర్భరజీవితాన్ని
గడిపేస్తున్నాం .....!
భోధనాభాషను
తెలుగుకాకుండాచేసి
ఆంగ్లంమోజులో ...
తైతక్కలాడుతున్నాం !
పరభాషను --
అసలువద్దని చెప్పలేము ,
పరిమితులు దాటితె,
ఏదైనా అనర్ధమే కదా !
అయితే....
ఏ భాష అయినా
మాతృబాష తరువాతే నని
తెలుసుకొవాలి ,
ఈ నేపద్యంలో---
మాతృభాషాభి వృద్ది
మన యింటినుండి....
మన నుండి....
మన పిల్లలనుండి
ప్రారంభం కావాలి.....!
నినాదాలు ప్రక్కనపెట్టి,
ప్రాధాన్యతలు---
ఒకరోజుకే పరిమితం చేయక
ప్రతి ఒక్కరూ....
మాతృభాష
మసకబారి పోకుండా
నిత్యం తెలుగుకు--
ప్రాధాన్యత నివ్వాలి....
భాషను కలకాలం ---
జీవభాషగా నిలబెట్టుకోవాలి!!
***
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి