సుప్రభాత కవిత ; - బృంద
తూరుపు ప్రసవించిన
వెలుగుల బంతిని చూసి
కన్నుల కాంతులు నిండగా
మై మరచి చూస్తున్న  నింగి

నేలకు పాకుతున్న బంగరు
ధారలా మెరిసే కాంతి కిరణాలు
తెస్తున్న బాలుని  కారుణ్యాలు
అందుకుని మురిసె అవని

ధగధగల మెరుపుల మధ్య
ఎదిగివస్తున్న భానుని బింబము
చూచి అచ్చెరువున నిలచిన
తరువులు తోచె  చిత్తరువులై!

జగద్రక్షకుని చూపు సోకిన
జగతి జయజయకారాలు చేస్తూ
జనకుని చూసిన చందమున
సంబరాన పరవశించి పొంగిపోయె!

మనుగడలో ఒడిదుడుకుల
మర్మ మెరిగి నడచుకొమ్మని
చీకటివెలుగుల  తపనలు
తప్పవు ప్రతి  మనిషికి అని

ఎరుకతో ఆడుగులు వేయించి
దోవలో ముళ్ళు తగ్గించి
చేయి పట్టుకు నడిపించి
తెరువు చూపి దరి చేర్చే దైవానికి

🌸🌸సుప్రభాతం 🌸🌸

 
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం