మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి, నెల్లూరు.9666639489
 ఈ తీర్థంలో మధ్యగ ఒక చక్కటి రాతి మండపం ఉంది అందులో దశావతారాలు శిలలో బాగా శిల్పము చేయబడినవి ఈ మండపం నాలుగు సంవత్సరాల క్రిందట జీర్ణోద్దారణ చేయబడింది ఈ తీర్థము శ్రీవారి దేవస్థానమునకు ఉత్తర భాగమున ఈ ప్రాకారమునకు మూడు గజముల దూరంలో ఉన్నది  యాత్రికులందరూ కూడా ఇందులో స్నానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటారు  ధనుర్మాసంలో శుక్లపక్ష ద్వాదశి అరుణోదయం ఈ తీర్థానికి ముక్కోటి శ్రీవారి దేవస్థానం నుంచి చక్ర తాళ్వార్ వేంచేసి స్నానం చేయిస్తారు అప్పుడు విశేషంగా  జనం ఉండి చక్రతాళ్వార్  తో కూడా స్నానం చేస్తారు ఆ సమయాన సర్వ తీర్థాల దేవతలందరూ కూడా అచట స్నానానికి వస్తారు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు  ఈ విషయాలన్నీ స్కంద పురాణంలో నిక్షిప్తమై ఉన్నాయి.శ్రీ వైకుంఠ తీర్థం శ్రీవారి పుష్కరిణికి ఈశాన్య భాగాన రెండుమైళ్ళ దూరంలో ఒక గుహ ఉంది దీని పేరు వైకుంఠ గృహ అని వాడతారు ఎప్పుడు వస్తూనే ఉంటుంది దీనిని వైకుంఠ తీర్థం అని చెప్తూ ఉంటారు శ్రీరాములవారు పంపానది దాటివానరసైన్యముతో లంకకు వెళ్లేటప్పుడు శ్రీ స్వామి పుష్కరిణి తీరంలో నిలిచి ఉన్నారని వానర బల పరాక్రమశాలురైన గజ గవాక్ష గవ అప్సర గంధమాసవాదులు  సింహ తుల్య పరాక్రమశాలు ఆ గుహ ప్రవేశించారు కోటి సూర్య ప్రకాశమానమైన ఒక తేజస్సును ఒక పట్టణాన్ని అక్కడ చూశారు  ఈ విషయాలన్నీ కూడా వరాహ పురాణంలో ఉన్నాయి ఈ ప్రకారం చూస్తూ ఉండగా చతుర్బాహులు గల ఒక పురుషుడు కట్టెతో కొట్ట వచ్చినట్లు కనపడ  గా వారందరూ పైబడి గుహలోపలినుంచి బయటకు పారిపోయి వచ్చారు అని ఉద్ఘా తం తన మిత్రులకు తెలిసి మహామాయి కామరూపి మొదలగు వానర సముదాయం అంతా కూడా బయలుదేరి వెళ్లి గుహంతా కూడా వెతికి పరిశీలించి అదేమియు కనిపించక పోయేసరికి తిరిగి వచ్చారు.
ఆ గుహ లోపలికి వెళ్లడానికి  మునులకు యోగులకు కష్ట సాక్ష్యం శ్రీమన్నారాయణ లీలా విలాసముతో చేత శిష్యులకు శ్రీ మహావిష్ణువు లోకం దర్శనమైంది కలియుగంలో జనులను ఉద్ధరించడానికి శ్రీమన్నారాయణ అనుకుంటారు ఈ ప్రభావం  వీళ్ళ తర్వాత మాత్రమే కలియుగంలో జనులకు దోషములు పోయి సమస్త సుఖాలు  పొందారు ఈ గుహలో  లోపల నుంచి వచ్చే తీర్థం సాక్షాత్తు వైకుంఠంలో నుంచి వచ్చుచున్నందున ఎంతో స్నాన ఫలము చెప్పనలవి కాదు  పాండవ తీర్థం శ్రీ స్వామి వారి దేవస్థానానికి ఈశాన్యం మూలలో సుమారుమయులుదూరంగా ఒక తీర్థం వుంది అది  శివక్షేత్ర పాలకుల చే కాపాడుతూ ఉంటుంది అక్కడ ఒక సంవత్సరం నివసించి ఆ తీర్థం లో స్నానపానములకు  ఉపయోగించుచున్నంతలో పుణ్యం వస్తుంది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం