వేళ్ళు ---డా .కె .ఎల్.వి.ప్రసాద్ -హనంకొండ ,వరంగల్ .-9866252002*-8886991785

బాపుజీ అనగానే ,
మహాత్ముడు 
జ్ఞాపకానికొస్తాడు ,
జాతిపిత అనగానే 
గాంధీతాత ....
గుర్తుకొస్తాడు ....!


మన దేశ స్వాతంత్య్రం 
అనగానే ....
సత్యాగ్రహం 
కళ్లముందు నిలుస్తుంది ,
అదే బాపుజీ ...
ఆయుధమని తెలుస్తుంది !


అహింసను బాపుజీ 
బోధించారు ....
హింసతోనే ఆయన 
మరణించారు 
ఆశించిన ఆశయం 
నెరవేరలేదు ..కానీ 
ప్రజలహృదయాలలో 
చిరంజీవి అయినాడు !


సత్యహరిశ్చంద్రుడి 
జీవితం ....
బాపూజీకి ఆదర్శం ,
అందుకే --
సత్యజీవితమే గాంధీజీని 
మహాత్ముడిగా నిలిపింది !


సత్యాన్వేషణే 
ఆయన ....
ఆత్మకథ అయింది ,
ఎదరెందరికో అది 
మార్గదర్శనం చేసింది !


పైచదువులకోసం 
విదేశాలకు వెళ్ళేటప్పుడు ,
" మధ్య పానం సేవించ"నని ,
"మాంసాహారం ముట్ట"నని ,
" పరస్త్రీని కన్నెత్తి చూడ "ననీ ,
అమ్మకిచ్చిన వాగ్ధానం ....
బ్రతికినంత కాలం 
పాటించిన మహానుభావుడు ,
మనగాంధీజీ ...!


బ్రతికుంటే ఇప్పటికాయనికి ,
నూటయాభై ఏళ్ళు .....!
భారతదేశంలో ఎప్పటికీ 
సుస్థిరం ....ఆయన 'వేళ్లు '!!


కామెంట్‌లు