బాపుజీ అనగానే ,
మహాత్ముడు
జ్ఞాపకానికొస్తాడు ,
జాతిపిత అనగానే
గాంధీతాత ....
గుర్తుకొస్తాడు ....!
మన దేశ స్వాతంత్య్రం
అనగానే ....
సత్యాగ్రహం
కళ్లముందు నిలుస్తుంది ,
అదే బాపుజీ ...
ఆయుధమని తెలుస్తుంది !
అహింసను బాపుజీ
బోధించారు ....
హింసతోనే ఆయన
మరణించారు
ఆశించిన ఆశయం
నెరవేరలేదు ..కానీ
ప్రజలహృదయాలలో
చిరంజీవి అయినాడు !
సత్యహరిశ్చంద్రుడి
జీవితం ....
బాపూజీకి ఆదర్శం ,
అందుకే --
సత్యజీవితమే గాంధీజీని
మహాత్ముడిగా నిలిపింది !
సత్యాన్వేషణే
ఆయన ....
ఆత్మకథ అయింది ,
ఎదరెందరికో అది
మార్గదర్శనం చేసింది !
పైచదువులకోసం
విదేశాలకు వెళ్ళేటప్పుడు ,
" మధ్య పానం సేవించ"నని ,
"మాంసాహారం ముట్ట"నని ,
" పరస్త్రీని కన్నెత్తి చూడ "ననీ ,
అమ్మకిచ్చిన వాగ్ధానం ....
బ్రతికినంత కాలం
పాటించిన మహానుభావుడు ,
మనగాంధీజీ ...!
బ్రతికుంటే ఇప్పటికాయనికి ,
నూటయాభై ఏళ్ళు .....!
భారతదేశంలో ఎప్పటికీ
సుస్థిరం ....ఆయన 'వేళ్లు '!!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి