అక్కడ
వినిపించే గొంతు ,
వింత వింత విన్యాసాలు
చేస్తుంటుంది !
వేమూరి గగ్గయ్య ,
క్షణాల్లో ...
కొంగర జగ్గయ్య
అయిపోతుంది!
అప్పుడే ...
నెహ్రు ఆమాత్యుడి
స్వరాన్ని వినిపించిన
కమనీయ గొంతు ,
మనల్ని
మాయాలోకంలో
ముంచి,
జాన్ .ఎఫ్ .కెనడీ
స్వరం -
ఆశ్చర్యంలో ,
ముంచెత్తుతుంది!
ఈతరం ఎరుగని
గుర్రం జాషువా గొంతు,
అప్పటికప్పుడు ,
విశ్వనాధ అవతారం
ఎత్తుతుంది !
కళ్ళు మూసుకుని
వింటే,
మనముందు
టెన్ కామండ్మెంట్స్ ,
మెకన్నాస్ గోల్డ్
బెన్హర్ ,సంక్షిప్త శబ్ద చిత్రాలు,
ప్రత్యక్షమవుతాయి !
ఇంతకీ -
ప్రపంచ దేశాల్లో ,
ఓరుగల్లు -
ఘన కీర్తిని చాటిన ,
ఆ గొంతు ఎవరిది ?
ఇంకెవరిది,
ధ్వన్యనుకరణ సామ్రాట్
పద్మశ్రీ నేరెళ్ల వేణు మాధవ్ ది !
భువి నుండి దివికేగిన
బహుముఖ -
స్వర కళానిధి ది ,
మన ఓరగల్లు ముద్దు బిడ్డ ,
మిమిక్రీ వేణు మాధవ్ ది !!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి