ఆటలాడితే శరీరానికి
మెదడుకు ఎంతో మేలన్నారు సరే,
ఆడదామని బయటకు వస్తే అమ్మానాన్నలు ఉపాధ్యాయులు
చదువులంటూ ఇంట్లోకి తరిమేస్తున్నారు.
రోజుకో "సేపు పండు" తింటే
డాక్టర్ అవసరం లేదన్నారు
మళ్లీ వాటిలో ఏవో రసాయనాలు
వాడారని నోటి వద్ద నుండి లాగేశారు.
దేశాన్ని పరిశుభ్రంగా ఊడవాలి అంటూ
మొదలెట్టారో మహోద్యమం
కాకపోతే మరిచిపోయారు
మురికివాడల వద్ద ఉన్న దినార్తుల జీవితం.
మనసుంటే మార్గం ఉంటుంది అని
చక్కని హితబోధ చేస్తాడు
కష్టాలలో మనసుతో ఆలోచించకుండా
మార్గం కోసం వెతుకుతూ ఉంటాడు.
వ్యంజకాలు కవి:- లిఖిత్ కుమార్ గోదా (చిన్ని),
• T. VEDANTA SURY
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి