మేటి (నాటు )వైద్యుడు : కె . ఎల్వీ

ఒకప్పుడు గ్రామాలు లేదా పల్లెటూళ్ళు ,అనారోగ్య సమస్యలకు ఎక్కువ శాతం’గృహ వైద్యం ‘ మీదే  ఆధారపడి ఉండేవారు . కారణం అందరికీ 
తెలిసిందే !వైద్యరంగం అప్పటికి పల్లెటూళ్లకు విస్తరించబడలేదు . ఆసు -
పత్రికి వెళ్లాలంటే ,కిలోమీటర్ల దూరం నడవాలిసిందే . కనీసం ఆర్. ఎం.పి 
వైద్య సదుపాయం కూడా అందుబాటులోలేని రోజులవి ,అవే -నా బాల్యపు 
రోజులు . అసలు అప్పుడు ఆయా ప్రాంతాలలోని ప్రజలు ఎలా బ్రతికి బట్ట-
కట్టారో .. ఇప్పటికీ అర్ధం కాదు . అయితే అప్పటి కల్తీ లేని ఆహారం ,శరీరా
నికి సరిపడినంత సహజ వ్యాయామం ,స్వచ్ఛమైన గాలీ ,నీరూ ,పాడీ ,
వృక్ష సంపదా వారిని ఆరోగ్యవంతులుగా వుంచాయని సర్ది చెప్పుకోవాలి !
కేవలం పరిశుబ్రత లోపంవల్ల అక్కడక్కడా ,అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుండేయి . అలాంటి వారికోసం ,అటు ఆర్. ఎం. పి,వైద్యు--
లకు ,ఇటు నాటు వైద్యులకూ మధ్యస్తంగా ,గ్రామంలో ఎవరోఒకరు తమ-
కు ,తోచిన రీతిలో వైద్యం చేస్తుండేవారు. వారికి ఎలాంటి వైద్యం చేసే అర్హత 
ఉండదు . కానీ .. వైద్యం చేస్తారు . 
నా చిన్నతనం లో అలాంటి వారు ఇద్దరు ఉండేవారు. నాడి చూసి వైద్యం చెప్పే నిరక్ష్యరాస్యుడు (పశువుల కాపరి )ఒకాయన . ఆయన పేరు 
కలిగిత లక్ష్మయ్య . పంచెకట్టు,భుజాన కండువా ,చేతిలో దుడ్డు కర్ర ,తైల -
సంస్కారం లేని తల,ఆయన ఆహార్యం . ఇంటికి వచ్చేవారు ఆయన. మరొకరు దేవ జనార్దన్. భారీ శరీరం . అర్హత లేని హోమియో వైద్యుడు . 
కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా జైలులో వుండి నేర్చుకున్న వైద్యం . 
హోమియో మాత్రలకోసం ఇంటికి వెళ్ళాలి . బయటికి వచ్చేవారు కాదు 
ఆయన . మా తల్లిదండ్రులు ఎక్కువగా కలిగిత.లక్ష్మయ్య గారి మీదే ఆధార పడేవారు. 
ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే ,ఆయన్ను పిలిపించేవారు. ఆయన నాడిచూసి ,’’లంఖణం పరమౌషధం ‘’సూత్రాన్ని అక్షరాలా అమలు చేయించే వారు . అసలే .. నాకు ఆకలి ఎక్కువ . తినకపోతే చాలా నీరసం 
వచ్చేది . నా విషయం తెలిసిన మా మేనత్త ,(వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్క
నే )రాపాక ఎల్లమ్మ ,ఎవరూ చూడకుండా ,చాటుగా అన్నం తెచ్చి తిన 
మనేది . నేను గబ.. గబ.. తినేసేవాడిని. రెండురోజుల తర్వాత సదరు 
వైద్యుడుగారు ,నాడి చూసి ,మా అమ్మను ఉద్దేశించి ‘’ఎంపీల్లా .. వీడికి 
అన్నం పెట్టేశారా “అనేవాడు . ఆలోచిస్తే అది ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే 
అంశమే !
ఇక జ్వరం తగ్గాక -అసలు నిద్రపోకూడదన్న ఆంక్ష ఉండేది . మిరియాల చా రు తో భోజనం చేసాక ,నిద్ర ముంచుకొచ్చేది . నిద్ర రాకుండా ఎదో ఆకులు తెచ్చి ,చేతులతో నలిపి వాటి పసరు కళ్ళల్లో పిండేవాడు. అంతే 
కళ్ళు ఒకటే మంటలు ఎక్కడినిద్ర అక్కడికి పరార్ . అది గుర్తుకు వస్తే 
ఇప్పటికీ వళ్లు గగుర్పొడుస్తుంది . 
అలా .. బాల్యాన్ని నేటేశాం . బడికి వెళ్లే వయసు వచ్చేసరికి ఆర్. ఎం.పి 
వైద్యుల రాకపోకలు ప్రారంభం అయ్యాయి . ఇంజెక్షన్ల పర్వం మొదలయింది నేను హైద్రాబాద్ కు చేరుకోవడం కూడా జరిగిపోయింది !


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం